టీడీపీ ‘మోత మొగిద్దాం’ పిలుపు అపూర్వ స్పందన
- October 01, 2023
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసన గా టీడీపీ ఇచ్చిన ‘మోత మొగిద్దాం’ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చిన. ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు బయటకు వచ్చి..మోత మోగించారు. ప్లేట్స్ ఫై సౌండ్ చేయడం..విజిల్ చేయడం ..డ్రమ్స్ కొట్టడం వంటివి చేసి తమ సంఘీభావం తెలిపారు. నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ నేతలు ఢిల్లీ లో మోత మోగించగా..నారా బ్రహ్మణి రాజమండ్రి లో , నారా భువనేశ్వరి హైదరాబాద్ లో మోత మోగించారు.
రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో జనాలతో కలిసి బ్రాహ్మణి పాల్గొన్నారు. సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుపడుతు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఈలలతో మోత మోగించారు. క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్ధతుగా డబ్బులు, ఈలలతో మోత మోగించారు. సరిగ్గా 7 గంటలకు క్యాంపు కార్యాలయం బయట వీరంతా ఈలలు, డప్పుల శబ్ధాలు చేశారు. కంచాలు కొడుతూ, విజిల్స్, బూరెలు ఊదుతూ చంద్రబాబుకు తమ మద్ధతు ప్రకటించారు టీడీపీ శ్రేణులు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









