హవల్లిలోని రెస్టారెంట్ సీజ్
- October 10, 2023
కువైట్: వినియోగదారులకు అందించే ఆహారం, పానీయాలలో గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగించినందుకు హవల్లిలోని ఒక రెస్టారెంట్ మరియు కేఫ్ను వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు మూసివేశారు. నివేదిక ప్రకారం.. పరిశీలకులు, హవల్లిలోని కేఫ్లలో ఒకదానిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన సమయంలో వినియోగదారులకు అందించే ఆహారం, పానీయాలు మరియు షిషా తయారీలో ఉపయోగించే పదార్థాలు నెలల క్రితం గడువు ముగిసినట్లు గుర్తించారు. గడువు ముగిసిన వాటాల్లో చికెన్, జున్ను, జామ్, హాలౌమి మరియు కొబ్బరి, అలాగే కొంతకాలంగా ఉన్న వేడి మరియు శీతల పానీయాల పదార్థాలు, వీటిలో పొడి పాలు, కోకో, అన్ని రకాల కాఫీ మరియు టీలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









