ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం: 1,500 మందికి పైగా మృతి
- October 10, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్లో హమాస్పై ఇజ్రాయెల్ భీకర దాడి ఇప్పుడే ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతం అవుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఆదివారం అధికారికంగా హమస్ పై యుద్ధం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్లో 900 మంది, గాజాలో 680 మందికి పైగా మరణించారు. మొత్తంగా ఈ భీకర దాడుల్లో 1,500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు పౌరులపై దాడులను ఆపాలని ఇజ్రాయెల్కు యూఏఈ సహా అరబ్ దేశాలు కోరాయి. ఇదిలా ఉండగా.. పాలస్తీనా హమాస్ చేజిక్కించుకున్న గాజా సరిహద్దు కంచె ప్రాంతాలను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఆ ప్రాంతంలో భారీగా మందుపాతరలను అమర్చుతున్నట్లు ప్రధాన సైనిక ప్రతినిధి మంగళవారం తెలిపారు. సోమవారం నుండి గాజా నుండి కొత్తగా చొరబాట్లు నమోదు కాలేదని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ 300,000 మంది రిజర్వ్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్పై దిగ్బంధనాన్ని విధించింది. కాగా, ఇజ్రాయెల్ బాంబు వేసిన ప్రతిసారీ ఇజ్రాయెల్ బందీని ఉరితీస్తామని హమాస్ సాయుధ విభాగం ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







