ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం: 1,500 మందికి పైగా మృతి
- October 10, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్లో హమాస్పై ఇజ్రాయెల్ భీకర దాడి ఇప్పుడే ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతం అవుతుందని ప్రకటించారు. ఇజ్రాయెల్ ఆదివారం అధికారికంగా హమస్ పై యుద్ధం ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఇజ్రాయెల్లో 900 మంది, గాజాలో 680 మందికి పైగా మరణించారు. మొత్తంగా ఈ భీకర దాడుల్లో 1,500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు పౌరులపై దాడులను ఆపాలని ఇజ్రాయెల్కు యూఏఈ సహా అరబ్ దేశాలు కోరాయి. ఇదిలా ఉండగా.. పాలస్తీనా హమాస్ చేజిక్కించుకున్న గాజా సరిహద్దు కంచె ప్రాంతాలను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఆ ప్రాంతంలో భారీగా మందుపాతరలను అమర్చుతున్నట్లు ప్రధాన సైనిక ప్రతినిధి మంగళవారం తెలిపారు. సోమవారం నుండి గాజా నుండి కొత్తగా చొరబాట్లు నమోదు కాలేదని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ 300,000 మంది రిజర్వ్ ఫోర్స్ ను రంగంలోకి దించింది. గాజా స్ట్రిప్పై దిగ్బంధనాన్ని విధించింది. కాగా, ఇజ్రాయెల్ బాంబు వేసిన ప్రతిసారీ ఇజ్రాయెల్ బందీని ఉరితీస్తామని హమాస్ సాయుధ విభాగం ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







