ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే దుబాయ్ కి ప్రయాణం
- October 19, 2023
దుబాయ్: విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్, వీసా వంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ తప్పనిసరి. ఇవి లేకుండా విదేశాలకు ప్రయాణం దాదాపు అసాధ్యం. అయితే, టెక్నాలజీ వినియోగంలో దూసుకెళ్తున్న దుబాయ్ ప్రభుత్వం.. విదేశీయులు తమతో పాటు ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా నగరాన్ని సందర్శించవచ్చని చెబుతోంది. దీనికి కారణం స్మార్ట్ టెక్నాలజీ. అద్భుతమైన స్మార్ట్ ఆలోచనతో ముందుకు వస్తోంది. భవిష్యత్లో దుబాయ్ నివాసితులు, సందర్శకులు ఎలాంటి పాస్పోర్ట్, వీసా, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే ప్రయాణించే దిశగా అడుగులేస్తోంది. దీని కోసం ఓ ప్రత్యేకమైన స్మార్ట్ టెక్నాలజీ వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎమారాటెక్ అనే టెక్నాలజీ సంస్థతో చేతులు కలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్-దుబాయ్ (GDRFA)తో కంపెనీ కలిసి పని చేస్తోంది.
ఈ సందర్భంగా ఎమారాటెక్ మేనేజర్ అహ్మద్ బహా మాట్లాడుతూ.. 'ఒక ప్రయాణికుడు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, వారు మాకు ఎలాంటి ట్రావెల్ పత్రాలు చూపించకుండానే మేము వారి తాలూకు డేటాను వారి ముందు ఉంచుతాము. వారి ఫ్లైట్, వీసా వివరాలు మా సిస్టమ్లో ఉంటాయి' అని అన్నారు. ఇలా ప్రయాణికుల స్మార్ట్ చెకింగ్ అనేది చెక్-ఇన్ కౌంటర్ వద్ద నుంచే ప్రారంభం అవుతుందన్నారు. అక్కడ ప్రయాణికుల ఫొటోలు క్యాప్చర్ చేయబడి, వారి ముఖ లక్షణాలను స్కాన్ చేసే స్ట్రీమ్లైన్డ్ ప్రక్రియ ఉంటుంది. తద్వారా వారి సమగ్ర ప్రయాణ సమాచారం అందించబడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..