గాజాలోని పాలస్తీనియన్లకు సౌదీ అరేబియా నిధుల సేకరణ

- November 03, 2023 , by Maagulf
గాజాలోని పాలస్తీనియన్లకు సౌదీ అరేబియా నిధుల సేకరణ

రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్,  క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief)తో అనుబంధంగా ఉన్న సాహెమ్ ప్లాట్‌ఫారమ్‌లో పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.  నిధుల సేకరణ ప్రచారానికి రాజు సల్మాన్ 30 మిలియన్లు, క్రౌన్ ప్రిన్స్ SAR20 మిలియన్లు విరాళంగా ఇచ్చారు. రాయల్ కోర్ట్ సలహాదారు, KSrelief సూపర్‌వైజర్ జనరల్ డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ ఈ నిధుల సేకరణ ప్రచారం సంక్షోభాలలో ఉన్న పాలస్తీనా ప్రజలకు మద్దతుగా చేపట్టినట్లు పేర్కొన్నారు. సౌదీ మానవతావాద మరియు అభివృద్ధి మద్దతు పాలస్తీనా ప్రజలకు చేరుకోవడం ఎప్పుడూ ఆగలేదని ఆయన తెలిపారు. పాలస్తీనా ప్రజలకు సహాయాన్ని అందించడంలో రాజ్యం అగ్రస్థానంలో ఉందని అల్ రబీహ్ తెలిపారు. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడికి మరియు సోదర పాలస్తీనా ప్రజలకు సహాయం చేయడానికి మద్దతు ఇచ్చినందుకు క్రౌన్ ప్రిన్స్‌కు కృతజ్ఞతలు,  ప్రశంసలు తెలియజేసారు. ప్రచారానికి విరాళం క్రింది లింక్ https://sahem.ksrelief.org/Gaza ద్వారా Sahem ప్లాట్‌ఫారమ్ ద్వారా లేదా Apple Store,  Google Play ద్వారా Sahem మొబైల్ యాప్ ద్వారా అందించవచ్చు. దాతలు తమ విరాళాలను నేరుగా అల్ రాజ్హి బ్యాంక్‌లోని ప్రచార బ్యాంక్ ఖాతా (SA5580000504608018899998)కు పంపవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com