యూఏఈలో CBSE ప్రాంతీయ కార్యాలయం.. స్వాగతించిన విద్యావేత్తలు
- November 06, 2023
యూఏఈ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రాంతీయ కార్యాలయాన్ని యూఏఈలో ఏర్పాటు చేయాలనే ఇండియా నిర్ణయించడంపై యూఏఈలోని సిబిఎస్ఇ పాఠశాల టీచర్లు సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం విద్యార్థులు, ఉపాధ్యాయులకు సత్వర పరిష్కారాలను అందిస్తుందన్నారు. దుబాయ్లోని సిబిఎస్ఇ కార్యాలయాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మూడు రోజుల యూఏఈ పర్యటన సందర్భంగా ప్రకటించారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లో జరిగిన సమావేశంలో యూఏఈలోని సిబిఎస్ఇ పాఠశాలల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. సిబిఎస్ఇ ప్రణాళికాబద్ధమైన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం భారతీయ మిషన్లతో కలిసి పనిచేస్తుందని ప్రధాన్ పేర్కొన్నారు. యూఏఈలోని సాధారణ విద్యా పాఠశాలల్లో భారతీయ సంతతికి చెందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 271,109గా ఉంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 248, ప్రైవేట్ పాఠశాలల్లో 270,861 మంది చదువుతున్నారు. విద్యార్థులు భారతదేశం వెలుపల బోర్డు మరియు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







