యూఏఈలో CBSE ప్రాంతీయ కార్యాలయం.. స్వాగతించిన విద్యావేత్తలు
- November 06, 2023
యూఏఈ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రాంతీయ కార్యాలయాన్ని యూఏఈలో ఏర్పాటు చేయాలనే ఇండియా నిర్ణయించడంపై యూఏఈలోని సిబిఎస్ఇ పాఠశాల టీచర్లు సానుకూలంగా స్పందించారు. ఈ నిర్ణయం విద్యార్థులు, ఉపాధ్యాయులకు సత్వర పరిష్కారాలను అందిస్తుందన్నారు. దుబాయ్లోని సిబిఎస్ఇ కార్యాలయాన్ని ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మూడు రోజుల యూఏఈ పర్యటన సందర్భంగా ప్రకటించారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లో జరిగిన సమావేశంలో యూఏఈలోని సిబిఎస్ఇ పాఠశాలల ప్రిన్సిపాల్స్ హాజరయ్యారు. సిబిఎస్ఇ ప్రణాళికాబద్ధమైన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం భారతీయ మిషన్లతో కలిసి పనిచేస్తుందని ప్రధాన్ పేర్కొన్నారు. యూఏఈలోని సాధారణ విద్యా పాఠశాలల్లో భారతీయ సంతతికి చెందిన మొత్తం విద్యార్థుల సంఖ్య 271,109గా ఉంది. ఇందులో ప్రభుత్వ పాఠశాలల్లో 248, ప్రైవేట్ పాఠశాలల్లో 270,861 మంది చదువుతున్నారు. విద్యార్థులు భారతదేశం వెలుపల బోర్డు మరియు పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









