మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్గా.?
- November 15, 2023పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ సినిమా ఇటీవల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సాయి ధరమ్ తేజ్ సిద్ధం చేసి పెట్టాడు.
అందులో ఒకటి మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పక్కా మాస్ గెటప్లోకి మారిపోనున్నాడట తేజు. అలాగే, సినిమాకి సంబంధించి ఓ ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది తాజాగా.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఈ మధ్య మెగా కాంబో మూవీస్ బాగానే తెరకెక్కుతున్నాయ్. అయితే, ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నాయ్. ‘ఆచార్య’ ఆ కోవలో మొదటి స్థానంలో వుంది.
‘బ్రో’ హిట్టంటే హిట్టు.. ఫట్ అంటే ఫట్టు. మరి ఈ నేపథ్యంలో చిరు, తేజు కాంబో ఎలా వర్కవుట్ అవుతుందో.! అయితే, చిరంజీవి వెరీ షార్ట్ రోల్లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రలో నటించబోతున్నారీ సినిమాలో అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో.!
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్