మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్గా.?
- November 15, 2023
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ సినిమా ఇటీవల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సాయి ధరమ్ తేజ్ సిద్ధం చేసి పెట్టాడు.
అందులో ఒకటి మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పక్కా మాస్ గెటప్లోకి మారిపోనున్నాడట తేజు. అలాగే, సినిమాకి సంబంధించి ఓ ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది తాజాగా.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఈ మధ్య మెగా కాంబో మూవీస్ బాగానే తెరకెక్కుతున్నాయ్. అయితే, ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నాయ్. ‘ఆచార్య’ ఆ కోవలో మొదటి స్థానంలో వుంది.
‘బ్రో’ హిట్టంటే హిట్టు.. ఫట్ అంటే ఫట్టు. మరి ఈ నేపథ్యంలో చిరు, తేజు కాంబో ఎలా వర్కవుట్ అవుతుందో.! అయితే, చిరంజీవి వెరీ షార్ట్ రోల్లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రలో నటించబోతున్నారీ సినిమాలో అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో.!
తాజా వార్తలు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు
- దుబాయ్లో ఘనంగా ప్రవాస తెలుగువారి క్రూజ్ క్రిస్మస్ వేడుకలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు







