మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్గా.?
- November 15, 2023
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ సినిమా ఇటీవల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సాయి ధరమ్ తేజ్ సిద్ధం చేసి పెట్టాడు.
అందులో ఒకటి మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పక్కా మాస్ గెటప్లోకి మారిపోనున్నాడట తేజు. అలాగే, సినిమాకి సంబంధించి ఓ ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది తాజాగా.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఈ మధ్య మెగా కాంబో మూవీస్ బాగానే తెరకెక్కుతున్నాయ్. అయితే, ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నాయ్. ‘ఆచార్య’ ఆ కోవలో మొదటి స్థానంలో వుంది.
‘బ్రో’ హిట్టంటే హిట్టు.. ఫట్ అంటే ఫట్టు. మరి ఈ నేపథ్యంలో చిరు, తేజు కాంబో ఎలా వర్కవుట్ అవుతుందో.! అయితే, చిరంజీవి వెరీ షార్ట్ రోల్లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రలో నటించబోతున్నారీ సినిమాలో అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







