మేనల్లుడి కోసం మెగాస్టార్ గెస్ట్గా.?
- November 15, 2023
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన ‘బ్రో’ సినిమా ఇటీవల సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులు సాయి ధరమ్ తేజ్ సిద్ధం చేసి పెట్టాడు.
అందులో ఒకటి మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా ఒకటి. ఈ సినిమా కోసం పక్కా మాస్ గెటప్లోకి మారిపోనున్నాడట తేజు. అలాగే, సినిమాకి సంబంధించి ఓ ప్రచారం జోరుగా తెరపైకి వచ్చింది తాజాగా.
మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషించబోతున్నారన్నదే ఆ ప్రచారం తాలూకు సారాంశం. ఈ మధ్య మెగా కాంబో మూవీస్ బాగానే తెరకెక్కుతున్నాయ్. అయితే, ఎక్కువగా ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నాయ్. ‘ఆచార్య’ ఆ కోవలో మొదటి స్థానంలో వుంది.
‘బ్రో’ హిట్టంటే హిట్టు.. ఫట్ అంటే ఫట్టు. మరి ఈ నేపథ్యంలో చిరు, తేజు కాంబో ఎలా వర్కవుట్ అవుతుందో.! అయితే, చిరంజీవి వెరీ షార్ట్ రోల్లో కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించే పాత్రలో నటించబోతున్నారీ సినిమాలో అంటున్నారు. చూడాలి మరి, ఈ ప్రచారం ఎంతవరకూ నిజమో.!
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







