కువైట్ లో 66 మిలియన్ దినార్ల ట్రాఫిక్ జరిమానాలు జారీ
- November 15, 2023
కువైట్: ప్రస్తుత 2023 సంవత్సరానికి ట్రాఫిక్ ఉల్లంఘనల మొత్తం విలువ సుమారు 66 మిలియన్ దినార్లు అని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబి తెలిపారు. 2023 సంవత్సరంలో మొత్తం 1,748,368 చెల్లించని ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగాయని, వీటి మొత్తం విలువ 44 మిలియన్ దినార్లను మించిందని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ ఉల్లంఘనల్లో ఎక్కువ భాగం శాశ్వతంగా దేశం విడిచి వెళ్లిన ప్రవాసులవి ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన 122 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఉల్లంఘనలు పూర్తిగా ఆటోమేటిక్గా మారాయన్నారు. ఉల్లంఘన రిజిస్టర్ చేయబడిన క్షణంలో సిస్టమ్లో రికార్డ్ చేయబడుతుందని, "సహల్" అప్లికేషన్ ద్వారా ఉల్లంఘించిన వ్యక్తికి సందేశం పంపబడుతుందని, ఉల్లంఘనల దర్యాప్తు విభాగంలో అభ్యంతరం చెప్పడానికి లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు లింక్ ద్వారా వెంటనే చెల్లించడానికి అతనికి హక్కు ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







