కొత్త అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ నుంచి సేవలు ప్రారంభం
- November 16, 2023
యూఏఈ: డిసెంబర్లో 12 నుంచి అబుదాబి విమానాశ్రయ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. దాదాపు 220 విమానాల్లో ప్రయాణించే 2.29 మిలియన్ల మంది ప్రయాణికులు కొత్త టెర్మినల్ సేవలు అందించనుంది. నవంబర్ మొదటి రెండు వారాల్లో 1,557 విమానాలు ఇక్కడి నుంచి ట్రయల్స్ నిర్వహించారు. నెలాఖరు నాటికి, మొత్తం విమానాల సంఖ్య 7,600 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్, తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లిని మాట్లాడుతూ.. అన్ని విమానయాన సంస్థలు ఇప్పుడు టెర్మినల్ A నుండి పనిచేస్తున్నందున, అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలకు కొత్త శకాన్ని ప్రారంభించాయని అన్నారు. అయితే, టెర్మినల్ Aపై అధికారిక ప్రారంభోత్సవం ఫిబ్రవరి 9, 2024న జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత, విమానాశ్రయం జాయెద్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చబడుతుంది.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







