నిరుద్యోగ బీమా పొందనందుకు జీతాల నుండి Dh400 కట్
- November 16, 2023
యూఏఈ: అక్టోబర్ 1 గడువులోపు నిరుద్యోగ బీమా పథకానికి సబ్స్క్రయిబ్ చేయడంలో విఫలమైన ఉద్యోగులు 400 దిర్హామ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్కీమ్కు సబ్స్క్రయిబ్ చేసి, మూడు నెలలకు పైగా ప్రీమియంలు చెల్లించడంలో విఫలమైన వారు 200 దిర్హామ్ల జరిమానాను ఎదుర్కొంటారు. జరిమానాలు చెల్లించకపోతే, ఉద్యోగులకు కొత్త వర్క్ పర్మిట్లు మంజూరు చేయబడవు. ఈమేరకు మానవ వనరులు మరియు ఎమిరటైజేషన్ (మోహ్రే) మంత్రిత్వ శాఖ బుధవారం హెచ్చరించింది. జరిమానాలు వారి జీతాలు లేదా ఎండ్-ఆఫ్-సర్వీస్ గ్రాట్యుటీ నుండి కూడా తీసివేయబడతాయని పేర్కొంది. నవంబర్ 15 నాటికి 6.6 మిలియన్లకు పైగా ప్రజలు తప్పనిసరి పథకానికి సభ్యత్వం పొందారని మోహ్రే తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







