ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం: 4 రోజుల్లో 50 మంది ఖైదీలు విడుదల
- November 23, 2023
యూఏఈ: ఇజ్రాయెల్లో ఖైదు చేయబడిన 150 మంది పాలస్తీనియన్లకు బదులుగా గాజాలో బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం జరిగింది. అలాగే గాజా ఎన్క్లేవ్లోకి మానవతా సహాయాన్ని అనుమతించడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ నాలుగు రోజుల విరామానికి బుధవారం అంగీకరించాయి. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ - హమాస్ అధికారులు ఒప్పందం కుదుర్చుకోవచ్చని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, యుఎస్ తెలిపాయి. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం.. 200 మందికి పైగా హమాస్ చెరలో ఉన్నారు. 50 మంది మహిళలు, పిల్లలను నాలుగు రోజులలో విడుదల చేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనా మహిళలు, పిల్లలకు బదులుగా 50 మంది బందీలను విడుదల చేయనున్నట్లు హమాస్ తెలిపింది. యుద్ధ విరమణ ఒప్పందం వందలాది మానవతా, వైద్య మరియు ఇంధన సహాయంతో కూడిన ట్రక్కులను గాజాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది అని హమాస్ వెల్లడించింది. సంధి కాలంలో గాజాలోని అన్ని ప్రాంతాల్లో ఎవరిపైనా దాడి చేయకూడదని లేదా అరెస్టు చేయకూడదని ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..