వాడి అల్ సెయిల్ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి
- November 25, 2023
బహ్రెయిన్: వాడి అల్ సెయిల్ ప్రాంతంలో శుక్రవారం జరిగి ఘోర అగ్నిప్రమాదంలో ఓ బహ్రెయిన్ కుటుంబం ముగ్గురు పిల్లలను కోల్పోయింది. హృదయ విదారకమైన సంఘటనలో 12 ఏళ్ల బాలిక, ఆమె ఆరేళ్ల సోదరి మరియు వారి ఐదేళ్ల సోదరుడు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అధికారులు వేగంగా స్పందించి వారి మరో ముగ్గురు తోబుట్టువులను విజయవంతంగా రక్షించారు. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పిల్లల తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నివేదిక అందిన వెంటనే, సివిల్ డిఫెన్స్ వాహనాలు వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ కార్యకలాపాలను ప్రారంభించాయి. కానీ అప్పటికే ముగ్గురు పిల్లలు శ్వాస ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించేలోపే వారు ప్రాణాలు వదిలారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







