రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ప్రధాని మోడీ
- November 26, 2023
తిరుమల: తెలంగాణలో ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ప్రధానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని రోడ్డు మార్గం ద్వారా తిరుమల పయనమయ్యారు. తిరుమల చేరుకున్న ఆయనకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. మోడీ ఈ రాత్రికి తిరుమలలోని రచన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.
తిరుపతి, తిరుమలలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు.షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బస చేసి, సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక 2015, 2017, 2019లో శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.ఇప్పుడు నాలుగోసారి శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు మోదీ.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







