సలహాదారులకు కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్..
- December 09, 2023
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారులుగా పని చేసిన వారికి కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి సర్కార్ షాక్ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేయకపోవడంతో ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ సీఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న రాజీవ్ శర్మ, పోలీస్, లా అండ్ ఆర్డర్, క్రిమినల్ కంట్రోల్ సలహాదారుగా ఉన్న అనురాగ్ శర్మ, మైనార్టీ వెల్ఫెర్ సలహాదారుగా ఉన్న ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారుగా ఉన్న జీ.ఆర్ రెడ్డి, ఫారెస్ట్ వ్యవహారలలో సలహాదారుగా ఉన్న ఆర్.శోభా, సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించిన సోమేశ్ కుమార్, వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాకపోవడంతో ఆ ప్రభుత్వం నియమించిన వారిలో ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు కె.వి రమణాచారి, ట్రాన్స్ కో, జెన్ కో సలహాదారు దేవులపల్లి ప్రభాకర్ రావు తమ పదువులకు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరితో పాటు మరికొందరు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రాజీనామా చేశారు.
--నారాయణ గుళ్ళపల్లి (మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







