ఏపీ విద్యార్థి ఐఎస్ఐఎస్ వీడియోలో
- May 28, 2016
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను తమవైపు ఆకర్షిస్తున్నారు. తాజాగా వారు విడుదల చేసిన ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. అమెరాకాలోని టెక్సాస్లో ఇంజనీరింగ్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థితో ఇండియాలో దాడులు చేస్తామని వీడియో రికార్డ్ చేసి విడుదల చేశారు. మే 19న విడుదల చేసిన ఈ 22 నిమిషాల నిడివి గల వీడియోను పరిశోధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇందులో ఆరుగురు భారతీయ విద్యార్థులు ఉన్నట్టు వెల్లడించింది.ఇందులో ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్కు చెందిన మహ్మద్ సాజిత్ అలియాస్ బాబా సాజిద్, ఫారూక్ అల్ హిందీ అలియాస్ అబురషీద్ ఉన్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్కు చెందిన అబు సల్హా అల్ హిందీ, ఫహద్ షేక్ అలియాస్ అబు అమర్ అల్ హిందీ, థానేకు చెందిన అమన్ తాండ్లే అలియాస్ అబు సల్మాన్ అల్ హిందీ, షాహామ్ థాంకీ ఉన్నారు. దీంతో ఐఎస్ఐస్ లోచేరిన భారతీయుల సంఖ్య 25 నుంచి 40 చేరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు.. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, ఐఎస్పై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









