యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు
- December 17, 2023
యూఏఈ: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(83) మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజు నుండి దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో, అలాగే విదేశాలలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలలో జాతీయ జెండాలను సగం మాస్ట్లో ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్లో కువైట్ ప్రజలు, రాజ కుటుంబానికి అధ్యక్షుడు సానుభూతిని వ్యక్తం చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









