యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు
- December 17, 2023
యూఏఈ: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(83) మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజు నుండి దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో, అలాగే విదేశాలలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలలో జాతీయ జెండాలను సగం మాస్ట్లో ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్లో కువైట్ ప్రజలు, రాజ కుటుంబానికి అధ్యక్షుడు సానుభూతిని వ్యక్తం చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







