యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు

- December 17, 2023 , by Maagulf
యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు

యూఏఈ: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(83) మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజు నుండి దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో, అలాగే విదేశాలలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలలో జాతీయ జెండాలను సగం మాస్ట్‌లో ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్‌లో కువైట్ ప్రజలు, రాజ కుటుంబానికి అధ్యక్షుడు సానుభూతిని వ్యక్తం చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com