యూఏఈలో 3 రోజులపాటు సంతాప దినాలు
- December 17, 2023
యూఏఈ: కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా(83) మరణం పట్ల యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్ ఎమిర్ మృతి నేపథ్యంలో మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజు నుండి దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాలలో, అలాగే విదేశాలలో ఉన్న యూఏఈ రాయబార కార్యాలయాలు, దౌత్య కార్యాలయాలలో జాతీయ జెండాలను సగం మాస్ట్లో ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ లో చేసిన పోస్ట్లో కువైట్ ప్రజలు, రాజ కుటుంబానికి అధ్యక్షుడు సానుభూతిని వ్యక్తం చేశారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!







