అల్ ముల్లా ప్లాజా ఘటన: బేస్ మెంట్ లోనే వాహనాలు. బీమాపై సందిగ్ధత
- December 26, 2023
దుబాయ్: దుబాయ్లోని ప్రముఖ అల్ ముల్లా ప్లాజాలో అగ్నిప్రమాదంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా భవనం బేస్ మెంట్ లో పార్క్ చేసిన కొన్ని కార్లు ఇప్పటికీ అక్కడే ఉండిపోయాయి. దానిని దుబాయ్ పోలీసులు బేస్మెంట్ పార్కింగ్ను మూసివేశారు. దీంతో పబ్లిక్ పార్కింగ్ను ఉపయోగిస్తున్నట్లు కొందరు నివాసితులుతెలిపారు. విచారణ పూర్తయితే కానీ తమ వాహనాలను తెచ్చుకోలేమని దాదాపు రెండేళ్లుగా తన కుటుంబంతో కలిసి భవనంలో నివాసముంటున్న భారతీయ జాతీయుడు తెలిపారు. 10 నెలల క్రితమే కారు కొనుగోలు చేశాడు. “ఇప్పుడు, నేను నా కారు కోసం 2,500 దిర్హామ్ల ఇన్స్టాల్మెంట్తో పాటు కారు కోసం నెలవారీ Dh3,000 అద్దె చెల్లించాలి. నాది సరికొత్త కారు కాబట్టి, వాహనం సమగ్ర బీమా పాలసీ పరిధిలోకి వస్తుంది.” అని పేర్కొన్నారు. అయితే, పాడైన వాహనాల నిర్వహణకు సంబంధించి ఎవరి బీమా కంపెనీ చెల్లిస్తుందనే దానిపై వాహన యజమానులు ఇంకా క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వారి వాదనలపై మరింత స్పష్టత వస్తుంది. నివాసితులు మరియు కార్యాలయాలకు వెళ్లేవారి కోసం బ్యాక్ డోర్ యాక్సెస్ మాత్రమే ఉంది. డిసెంబరు 16న జరిగిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో భవనంలోని కొన్ని కార్యాలయాలను సోమవారం తిరిగి తెరిచారు. అయితే, రిటైల్ యూనిట్లు ఇంకా తెరుచుకోలేదు. ఈ ప్లాజాలో దాదాపు 108 డ్యూప్లెక్స్లు, 60 రిటైల్ అవుట్లెట్లు మరియు కొన్ని కార్యాలయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి







