యూఏఈలో నిర్లక్ష్యపు డ్రైవర్లకు వెరైటీ పనిష్మెంట్
- December 26, 2023
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవర్లకు ప్రత్యేకమైన న్యాయస్థానం వెరైటీ పనిష్మెంట్ విధించింది. ఇటీవలి తీర్పులో అల్ ఐన్లోని ట్రాఫిక్ కోర్టు ముగ్గురు డ్రైవర్లకు ఒక్కొక్కరికి 50,000 దిర్హామ్లు జరిమానా విధించింది. వారి లైసెన్స్లను మూడు నెలలపాటు రద్దు చేసింది. వారి వాహనాలను జప్తు చేసింది. దీంతోపాటు వారు విన్యాసాలు చేసిన వీధులను కూడా శుభ్రం చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పబ్లిక్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల వారి భద్రతకు ముప్పుగా మారింది. దీంతో అధికారులు స్పందించి డ్రైవర్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వీధులను శుభ్రపరిచే రూపంలో రాక్లెస్ డ్రైవర్లకు సమాజ సేవ చేయవలసిందిగా కోర్టు శిక్ష విధించింది. దీనికి సంబంధించి న్యాయనిపుణులు స్పందించారు. కమ్యూనిటీ సేవ అనేది నిందితులలో మార్పును, బాధ్యతను పెంచుతుందని, జరిగిన నష్టాన్ని వారు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని లీగల్ కన్సల్టెన్సీలో లీగల్ కన్సల్టెంట్ అయిన హసన్ ఎల్హైస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







