యూఏఈలో నిర్లక్ష్యపు డ్రైవర్లకు వెరైటీ పనిష్మెంట్
- December 26, 2023
యూఏఈ: నిర్లక్ష్యపు డ్రైవర్లకు ప్రత్యేకమైన న్యాయస్థానం వెరైటీ పనిష్మెంట్ విధించింది. ఇటీవలి తీర్పులో అల్ ఐన్లోని ట్రాఫిక్ కోర్టు ముగ్గురు డ్రైవర్లకు ఒక్కొక్కరికి 50,000 దిర్హామ్లు జరిమానా విధించింది. వారి లైసెన్స్లను మూడు నెలలపాటు రద్దు చేసింది. వారి వాహనాలను జప్తు చేసింది. దీంతోపాటు వారు విన్యాసాలు చేసిన వీధులను కూడా శుభ్రం చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పబ్లిక్ రోడ్డు దెబ్బతినడమే కాకుండా చుట్టుపక్కల వారి భద్రతకు ముప్పుగా మారింది. దీంతో అధికారులు స్పందించి డ్రైవర్లను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వీధులను శుభ్రపరిచే రూపంలో రాక్లెస్ డ్రైవర్లకు సమాజ సేవ చేయవలసిందిగా కోర్టు శిక్ష విధించింది. దీనికి సంబంధించి న్యాయనిపుణులు స్పందించారు. కమ్యూనిటీ సేవ అనేది నిందితులలో మార్పును, బాధ్యతను పెంచుతుందని, జరిగిన నష్టాన్ని వారు స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని లీగల్ కన్సల్టెన్సీలో లీగల్ కన్సల్టెంట్ అయిన హసన్ ఎల్హైస్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









