‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ప్రారంభించిన సిఎం జగన్
- December 26, 2023
అమరావతి: సిఎం జగన్ ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు కిట్లను అందజేసిన సీఎం జగన్ అనంతరం మాట్లాడారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అన్నారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండగ.. 47 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు.
ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరం అన్నారు. క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వివరించారు. మంచి ఆరోగ్యానికి స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అన్నారు.
గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని సిఎం జగన్ ప్రకటించారు. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రతి ఊరికి ప్రతి ఒక్కరికీ పండుగే అని తెలిపారు. గ్రామ గ్రామాలలో ఆరోగ్య అవగాహన కోసం క్రీడలు ప్రాముఖ్యాన్ని తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







