ఖతార్‌లో మరణ శిక్ష పడిన 8 మంది భారతీయులకు బిగ్ రిలీఫ్

- December 28, 2023 , by Maagulf
ఖతార్‌లో  మరణ శిక్ష పడిన 8 మంది భారతీయులకు బిగ్ రిలీఫ్

దోహా: ఖతార్‌లో మరణశిక్ష పడిన 8 మంది భారతీయులకు పెద్ద ఊరట లభించింది. భారత ప్రభుత్వం అప్పీల్‌పై మొత్తం ఎనిమిది మంది మాజీ భారతీయ నావికులకు డిసెంబర్ 28న మరణశిక్షపై స్టే విధించారు. ఈ విషయమై ఖతార్‌లోని కోర్టును ఆశ్రయించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. విచారణ సందర్భంగా కోర్టు శిక్షను తగ్గించింది.

దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ సవివరమైన నిర్ణయం కాపీ కోసం వేచి చూస్తున్నామని తెలిపింది. తదుపరి చర్యలకు సంబంధించి ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలతో న్యాయ బృందం సంప్రదింపులు జరుపుతోంది. విచారణ సందర్భంగా రాయబారులు, అధికారులు కోర్టుకు హాజరయ్యారు. మొదటి నుండి ఎనిమిది మంది కుటుంబానికి అండగా నిలుస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com