తీవ్రవాద సంస్థకు చెందిన 84 మంది సానుభూతిపరులపై విచారణ
- January 07, 2024
యూఏఈ: తీవ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన 84 మంది సానుభూతిపరులను అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (స్టేట్ సెక్యూరిటీ కోర్ట్)కి రిఫర్ చేశారు. యూఏఈ గడ్డపై హింస మరియు ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో మరొక రహస్య సంస్థను స్థాపించారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. 2013- రాష్ట్ర భద్రత కేసు సంఖ్య (17)లో అరెస్టు చేసి విచారించకముందే నిందితులు తమ నేరాన్ని, సాక్ష్యాలను దాచిపెట్టారని అభియోగాలు మోపారు. సమగ్ర విచారణ ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు న్యాయస్థానం బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. చట్టపరమైన ప్రాతినిధ్యం లేని ప్రతి ప్రతివాది కోసం ఒక న్యాయవాదిని నియమించింది. కోర్టు సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. పబ్లిక్ ట్రయల్ ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









