తీవ్రవాద సంస్థకు చెందిన 84 మంది సానుభూతిపరులపై విచారణ
- January 07, 2024
యూఏఈ: తీవ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన 84 మంది సానుభూతిపరులను అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (స్టేట్ సెక్యూరిటీ కోర్ట్)కి రిఫర్ చేశారు. యూఏఈ గడ్డపై హింస మరియు ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో మరొక రహస్య సంస్థను స్థాపించారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. 2013- రాష్ట్ర భద్రత కేసు సంఖ్య (17)లో అరెస్టు చేసి విచారించకముందే నిందితులు తమ నేరాన్ని, సాక్ష్యాలను దాచిపెట్టారని అభియోగాలు మోపారు. సమగ్ర విచారణ ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు న్యాయస్థానం బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. చట్టపరమైన ప్రాతినిధ్యం లేని ప్రతి ప్రతివాది కోసం ఒక న్యాయవాదిని నియమించింది. కోర్టు సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. పబ్లిక్ ట్రయల్ ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







