తీవ్రవాద సంస్థకు చెందిన 84 మంది సానుభూతిపరులపై విచారణ
- January 07, 2024
యూఏఈ: తీవ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన 84 మంది సానుభూతిపరులను అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (స్టేట్ సెక్యూరిటీ కోర్ట్)కి రిఫర్ చేశారు. యూఏఈ గడ్డపై హింస మరియు ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో మరొక రహస్య సంస్థను స్థాపించారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. 2013- రాష్ట్ర భద్రత కేసు సంఖ్య (17)లో అరెస్టు చేసి విచారించకముందే నిందితులు తమ నేరాన్ని, సాక్ష్యాలను దాచిపెట్టారని అభియోగాలు మోపారు. సమగ్ర విచారణ ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు న్యాయస్థానం బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. చట్టపరమైన ప్రాతినిధ్యం లేని ప్రతి ప్రతివాది కోసం ఒక న్యాయవాదిని నియమించింది. కోర్టు సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. పబ్లిక్ ట్రయల్ ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







