తీవ్రవాద సంస్థకు చెందిన 84 మంది సానుభూతిపరులపై విచారణ
- January 07, 2024
యూఏఈ: తీవ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన 84 మంది సానుభూతిపరులను అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (స్టేట్ సెక్యూరిటీ కోర్ట్)కి రిఫర్ చేశారు. యూఏఈ గడ్డపై హింస మరియు ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో మరొక రహస్య సంస్థను స్థాపించారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. 2013- రాష్ట్ర భద్రత కేసు సంఖ్య (17)లో అరెస్టు చేసి విచారించకముందే నిందితులు తమ నేరాన్ని, సాక్ష్యాలను దాచిపెట్టారని అభియోగాలు మోపారు. సమగ్ర విచారణ ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు న్యాయస్థానం బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. చట్టపరమైన ప్రాతినిధ్యం లేని ప్రతి ప్రతివాది కోసం ఒక న్యాయవాదిని నియమించింది. కోర్టు సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. పబ్లిక్ ట్రయల్ ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..