తీవ్రవాద సంస్థకు చెందిన 84 మంది సానుభూతిపరులపై విచారణ
- January 07, 2024
యూఏఈ: తీవ్రవాద సంస్థ ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన 84 మంది సానుభూతిపరులను అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ (స్టేట్ సెక్యూరిటీ కోర్ట్)కి రిఫర్ చేశారు. యూఏఈ గడ్డపై హింస మరియు ఉగ్రవాద చర్యలకు పాల్పడే ఉద్దేశ్యంతో మరొక రహస్య సంస్థను స్థాపించారనే ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. 2013- రాష్ట్ర భద్రత కేసు సంఖ్య (17)లో అరెస్టు చేసి విచారించకముందే నిందితులు తమ నేరాన్ని, సాక్ష్యాలను దాచిపెట్టారని అభియోగాలు మోపారు. సమగ్ర విచారణ ద్వారా సేకరించిన సాక్ష్యాల ఆధారంగా.. యూఏఈ అటార్నీ-జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షమ్సీ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు న్యాయస్థానం బహిరంగ విచారణ ప్రక్రియను ప్రారంభించింది. చట్టపరమైన ప్రాతినిధ్యం లేని ప్రతి ప్రతివాది కోసం ఒక న్యాయవాదిని నియమించింది. కోర్టు సాక్షుల విచారణను కూడా ప్రారంభించింది. పబ్లిక్ ట్రయల్ ప్రక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







