గుజరాత్ సమ్మిట్: యూఏఈతో భారత్ కీలక ఒప్పందాలు
- January 10, 2024
గాంధీనగర్: వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు ముందు ఇండో-యూఏఈ మధ్య కీలక రంగాల్లో అవగాహన ఒప్పందాలు జరిగాయి. యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బుధవారం ప్రారంభం కానున్న వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ శిఖరాగ్ర సదస్సు 10వ ఎడిషన్కు యూఏఈ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. పునరుత్పాదక ఇంధన రంగాలలో పెట్టుబడి సహకారం, వినూత్న ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులు, ఫుడ్ పార్క్ అభివృద్ధి, సమర్థవంతమైన ఓడరేవులను సృష్టించడంపై జరిగిన అవగాహన ఒప్పందాలపై భారతదేశం -యూఏఈ సంతకం చేశాయి. గత 7 నెలలలో యూఏఈ-భారత్ మధ్య ఇది 4వ సమావేశమని, ఇరు దేశాలమధ్య భాగస్వామ్యాన్ని వేగంగా మార్చడాన్ని నాయకులు సంపన్నమైన భవిష్యత్తు కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







