ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్
- January 16, 2024
బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్లోని భారతీయ సమాజంలోని 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక సంపదను పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్స్ట్రింగ్స్ అనే కవితా సంకలనాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్ను కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







