ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్
- January 16, 2024
బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్లోని భారతీయ సమాజంలోని 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక సంపదను పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్స్ట్రింగ్స్ అనే కవితా సంకలనాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్ను కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









