ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్
- January 16, 2024
బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్లోని భారతీయ సమాజంలోని 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక సంపదను పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్స్ట్రింగ్స్ అనే కవితా సంకలనాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్ను కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







