ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్. ఆకట్టుకున్న స్టాల్స్
- January 16, 2024
బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్"ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్లోని రాయబార కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్లోని భారతీయ సమాజంలోని 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక సంపదను పంచుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హస్తకళల స్టాల్స్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో బహ్రెయిన్లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్స్ట్రింగ్స్ అనే కవితా సంకలనాన్ని కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్ను కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!