మాజీ ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష
- January 17, 2024
దుబాయ్: జూలై 2020లో జరిగిన ఒక సంఘటనలో తన యూరోపియన్ స్నేహితురాలిని హత్య చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఒక అరబ్ వ్యక్తికి మరణశిక్ష విధించింది. తన మాజీ స్నేహితురాలు మరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకోవడంతో తనను హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. నిందితుడు హత్యకు ముందే ప్లాన్ చేసి.. చాలా రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ తన మాజీ ప్రియురాలి కదలికలను నిశితంగా గమనించాడని, హత్య జరిగిన రోజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి మెడ కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న దుబాయ్ పోలీసులు మృతదేహాన్ని తరలించి, ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. దర్యాప్తు బృందం తగిన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించింది. తప్పించుకున్న నిందితుడు షాపింగ్ మాల్ దగ్గర ఉండగా పట్టుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడు 2017లో బాధితురాలితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం విడిపోయారు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తి సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు రెండేళ్లు దుబాయ్ వదిలివెళ్లింది. అనంతరం మరోసారి బాధితురాలిని నిందితుడు కలుసుకున్నాడు. ఈక్రమంలో బాధితురాలికి 30,000 దిర్హామ్లను అప్పుగా ఇచ్చాడు. అయినా మృతురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. నిందితుడికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించి తెగతెంపులు చేసుకున్నది. కానీ అతను ఆమెపై పగతో రగిలిపోయాడు. పక్కా ప్రణాళికతో ఓ రోజు ఆమె ఉంటున్న అపార్టుమెంట్ కు వెళ్లి హత్య చేసి పారిపోయాడు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







