మాజీ ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తికి మరణశిక్ష
- January 17, 2024
దుబాయ్: జూలై 2020లో జరిగిన ఒక సంఘటనలో తన యూరోపియన్ స్నేహితురాలిని హత్య చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఒక అరబ్ వ్యక్తికి మరణశిక్ష విధించింది. తన మాజీ స్నేహితురాలు మరొక వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకోవడంతో తనను హత్య చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ ద్వారా తెలుస్తోంది. నిందితుడు హత్యకు ముందే ప్లాన్ చేసి.. చాలా రోజుల పాటు ఆమెను వెంబడిస్తూ తన మాజీ ప్రియురాలి కదలికలను నిశితంగా గమనించాడని, హత్య జరిగిన రోజు ఆమె ఇంట్లోకి ప్రవేశించి మెడ కోసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న దుబాయ్ పోలీసులు మృతదేహాన్ని తరలించి, ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించారు. దర్యాప్తు బృందం తగిన ఆధారాలు సేకరించి, నిందితుడిని గుర్తించింది. తప్పించుకున్న నిందితుడు షాపింగ్ మాల్ దగ్గర ఉండగా పట్టుకున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుడు 2017లో బాధితురాలితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం విడిపోయారు. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తి సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు రెండేళ్లు దుబాయ్ వదిలివెళ్లింది. అనంతరం మరోసారి బాధితురాలిని నిందితుడు కలుసుకున్నాడు. ఈక్రమంలో బాధితురాలికి 30,000 దిర్హామ్లను అప్పుగా ఇచ్చాడు. అయినా మృతురాలు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదాలు జరిగాయి. నిందితుడికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించి తెగతెంపులు చేసుకున్నది. కానీ అతను ఆమెపై పగతో రగిలిపోయాడు. పక్కా ప్రణాళికతో ఓ రోజు ఆమె ఉంటున్న అపార్టుమెంట్ కు వెళ్లి హత్య చేసి పారిపోయాడు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









