8 మంది మత్స్యకారులను రక్షించిన వ్యక్తికి సత్కారం
- January 17, 2024
దుబాయ్: చేపల వేటలో మునిగిపోతున్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించిన ఎమిరాటీ నావికుడిని దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసి చేపలు పట్టేందుకు వెళుతుండగా.. ఒక వ్యక్తి అలలలో కొట్టుకుపోవడం గమనించాడు. వెంటనే రంగంలోకి దిగాడు. ఆ వ్యక్తిని రక్షించాడు. అల్ ఫలాసి ప్రథమ చికిత్స అందించాడు. తక్షణ సహాయం అవసరమయ్యే పడవలో మరో తొమ్మిది మంది ఉన్నారని గుర్తించాడు. వారందరిని రక్షించాడు. దురదృష్టవశాత్తు, అతను వారిని చేరుకోకముందే అప్పటికే వారిలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీశారు. మత్స్యకారులను రక్షించిన ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసిని దుబాయ్ పోలీస్లోని కమ్యూనిటీ హ్యాపీనెస్, లాజిస్టిక్స్ అఫైర్స్ కోసం అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అహ్మద్ మహ్మద్ రఫీ సత్కరించారు. ఫిషింగ్ ట్రిప్లు లేదా విహారయాత్రలు ప్లాన్ చేసే వ్యక్తులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









