8 మంది మత్స్యకారులను రక్షించిన వ్యక్తికి సత్కారం
- January 17, 2024
దుబాయ్: చేపల వేటలో మునిగిపోతున్న ఎనిమిది మంది మత్స్యకారులను రక్షించిన ఎమిరాటీ నావికుడిని దుబాయ్ పోలీసులు సత్కరించారు. ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసి చేపలు పట్టేందుకు వెళుతుండగా.. ఒక వ్యక్తి అలలలో కొట్టుకుపోవడం గమనించాడు. వెంటనే రంగంలోకి దిగాడు. ఆ వ్యక్తిని రక్షించాడు. అల్ ఫలాసి ప్రథమ చికిత్స అందించాడు. తక్షణ సహాయం అవసరమయ్యే పడవలో మరో తొమ్మిది మంది ఉన్నారని గుర్తించాడు. వారందరిని రక్షించాడు. దురదృష్టవశాత్తు, అతను వారిని చేరుకోకముందే అప్పటికే వారిలో ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అనంతరం వారి మృతదేహాలను వెలికితీశారు. మత్స్యకారులను రక్షించిన ఇస్సా మొహమ్మద్ అల్ ఫలాసిని దుబాయ్ పోలీస్లోని కమ్యూనిటీ హ్యాపీనెస్, లాజిస్టిక్స్ అఫైర్స్ కోసం అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ అహ్మద్ మహ్మద్ రఫీ సత్కరించారు. ఫిషింగ్ ట్రిప్లు లేదా విహారయాత్రలు ప్లాన్ చేసే వ్యక్తులందరూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు, భద్రతా చర్యలను తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







