తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు
- January 17, 2024
దుబాయ్: దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచారు తెలుగు వ్యక్తి. తెలుగు వారు ఎక్కడున్న నీతి, నిజాయితలకు మారుపేరుగా ఉంటారన్న మాటను మరోసారి నిజం చేశారు రాజశేఖర్ వర్మ అనే తెలుగాయన. తనకు దొరికిన విలువైన బంగారు, విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలను అందుకున్నారు. ఈ పని ఆయనతోపాటు తెలుగువారందరిపై ఎంతో గౌరవాన్ని పెంచింది. రాజశేఖర్ వర్మ నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను ప్రశంసా పత్రంతో సత్కరించి గౌరవించింది. బ్రిగేడియర్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్, దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీంలు రాజశేఖర్ వర్మను ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







