తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు

- January 17, 2024 , by Maagulf
తెలుగు వ్యక్తిని ఘనంగా సత్కరించిన దుబాయ్ పోలీసులు

దుబాయ్: దుబాయ్ లో నిజాయితీ అనే పదానికి నిదర్శనంగా నిలిచారు తెలుగు వ్యక్తి. తెలుగు వారు ఎక్కడున్న నీతి, నిజాయితలకు మారుపేరుగా ఉంటారన్న మాటను మరోసారి నిజం చేశారు రాజశేఖర్ వర్మ అనే తెలుగాయన. తనకు దొరికిన విలువైన బంగారు, విలువైన వస్తువులను నిజాయితీగా దుబాయ్ పోలీసులకు అప్పగించి ప్రశంసలను అందుకున్నారు. ఈ పని ఆయనతోపాటు తెలుగువారందరిపై ఎంతో గౌరవాన్ని పెంచింది. రాజశేఖర్ వర్మ నిజాయితీని మెచ్చుకున్న దుబాయ్ ప్రభుత్వం.. ఆయనను ప్రశంసా పత్రంతో సత్కరించి గౌరవించింది. బ్రిగేడియర్ సుల్తాన్ అబ్దుల్లా అల్ ఒవైస్, దుబాయ్ పోలీస్ కల్నల్ జమాల్ ఇబ్రహీంలు రాజశేఖర్ వర్మను ఘనంగా సత్కరించి ప్రశంస పత్రం అందజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com