యూఏఈ విజిట్ వీసా మార్పు: ఒమన్కు బస్సులు ఫుల్
- January 18, 2024
యూఏఈ: బస్సులో ఒమన్కు ప్రయాణించడం ద్వారా తమ వీసా స్థితిని మార్చుకోవాలని చూస్తున్న యూఏఈ సందర్శకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా 'వీసా-మార్పు ప్యాకేజీలు' బుక్ అయినట్లు ట్రావెల్ ఏజెంట్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒమన్కు బస్సులు గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయని, యూఏఈ సందర్శకులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వారు సూచించారు. విజిట్ వీసా గడువు ముగియడానికి కనీసం పది రోజుల ముందు తప్పనిసరిగా ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ చెప్పారు. రెహాన్ అల్ జజీరా టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ షిహాబ్ పర్వాద్ మాట్లాడుతూ.. ఇంతకుముందు వీసా మార్పుల కోసం సందర్శకులు విమాన సేవలను వినియోగించేవారని, ప్రస్తుతం వాటి ధరలు దాదాపు 20 శాతం పెరిగడంతో బస్సు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. బస్ ద్వారా వీసా మార్పులకు ప్యాకేజీ ధర Dh1,000 నుండి Dh1,100 వరకు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









