యూఏఈ విజిట్ వీసా మార్పు: ఒమన్కు బస్సులు ఫుల్
- January 18, 2024
యూఏఈ: బస్సులో ఒమన్కు ప్రయాణించడం ద్వారా తమ వీసా స్థితిని మార్చుకోవాలని చూస్తున్న యూఏఈ సందర్శకులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పూర్తిగా 'వీసా-మార్పు ప్యాకేజీలు' బుక్ అయినట్లు ట్రావెల్ ఏజెంట్లు చెప్పడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఒమన్కు బస్సులు గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయని, యూఏఈ సందర్శకులు ముందుగానే ప్లాన్ చేసుకోవాలని వారు సూచించారు. విజిట్ వీసా గడువు ముగియడానికి కనీసం పది రోజుల ముందు తప్పనిసరిగా ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకోవాలని తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిరోజ్ మలియక్కల్ చెప్పారు. రెహాన్ అల్ జజీరా టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ షిహాబ్ పర్వాద్ మాట్లాడుతూ.. ఇంతకుముందు వీసా మార్పుల కోసం సందర్శకులు విమాన సేవలను వినియోగించేవారని, ప్రస్తుతం వాటి ధరలు దాదాపు 20 శాతం పెరిగడంతో బస్సు ప్రయాణాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడిందని పేర్కొన్నారు. బస్ ద్వారా వీసా మార్పులకు ప్యాకేజీ ధర Dh1,000 నుండి Dh1,100 వరకు ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు
- స్టార్లింక్కు యూఏఈలో 10 ఏళ్ల లైసెన్స్
- భారత్తో సహా 10 దేశాలను సుంకాలతో టార్గెట్ చేసిన ట్రంప్
- ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్కు కీలక బాధ్యతలు
- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!







