సైబర్ సవాళ్ల పై చర్చించిన అరబ్ ఐటీ మంత్రులు
- January 19, 2024
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుధాబిలో జరిగిన అరబ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (ATICM) 27వ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఒమన్ ప్రతినిధి బృందానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ హిలాల్ అల్ బుసైది నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఆర్థిక వైవిధ్యీకరణకు చేపట్టిన ప్రభుత్వ విధానాలను వివరించారు. అరబ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అప్లికేషన్లతో సహా పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఫలితంగా పాలస్తీనా కమ్యూనికేషన్స్ రంగానికి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







