సైబర్ సవాళ్ల పై చర్చించిన అరబ్ ఐటీ మంత్రులు
- January 19, 2024
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుధాబిలో జరిగిన అరబ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (ATICM) 27వ సమావేశంలో ఒమన్ సుల్తానేట్ పాల్గొన్నది. ఒమన్ ప్రతినిధి బృందానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ హిలాల్ అల్ బుసైది నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఒమన్ చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ ప్రోగ్రామ్ ఆర్థిక వైవిధ్యీకరణకు చేపట్టిన ప్రభుత్వ విధానాలను వివరించారు. అరబ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోని అప్లికేషన్లతో సహా పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ ఫలితంగా పాలస్తీనా కమ్యూనికేషన్స్ రంగానికి ఎదురవుతున్న సవాళ్లను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









