ఆసియా కప్: దోహామెట్రో, లుసైల్ ట్రామ్లకు ఫుల్ డిమాండ్
- January 19, 2024
దోహా: జనవరి 12 నుండి జనవరి 16 వరకు జరిగిన 2023 ఆసియా కప్లో గ్రూప్ దశలో మొదటి రౌండ్లో దోహా మెట్రో మరియు లుసైల్ ట్రామ్ నెట్వర్క్లను ఉపయోగించిన మొత్తం ప్రయాణికుల సంఖ్యను ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) ప్రకటించింది. మెట్రో ద్వారా 1,040,973 మంది ప్రయాణికులు, ట్రామ్ ద్వారా 38,367 మంది ప్రయాణికులు.. మొత్తంగా 1,079,340 మంది ప్రయాణికులకు చేరుకుంది. నెట్వర్క్లకు అధిక డిమాండ్ ఉందని తెలిపింది. ప్రత్యేకించి టోర్నమెంట్ ప్రారంభ రోజు లుసైల్ స్టేడియంలో ఖతార్ వర్సెస్ లెబనాన్ మ్యాచ్ జరిగింది. ఇది టోర్నమెంట్ మొదటి రోజులో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ నెట్వర్క్లలో 234,862 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఎక్స్పో 2023 దోహా ఎగ్జిబిషన్ జరుగుతున్న సౌక్ వాకిఫ్, లుసైల్ బౌలేవార్డ్, కటారా మరియు అల్ బిడ్డా పార్క్ వంటి ముఖ్య ఈవెంట్ ప్రాంతాలు, ఆకర్షణలకు మెట్రో కనెక్టివిటీని అందించిందని ఖతార్ రైల్లోని స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ అజ్లాన్ ఈద్ అల్ ఎనాజీ తెలిపారు.
తాజా వార్తలు
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!
- వదంతులను నమ్మొద్దు..ప్రజలకు క్యాబినెట్ విజ్ఞప్తి..!!
- ఖతార్ లో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు..!!









