రియాద్ వేదికగా ఏప్రిల్లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ ప్రత్యేక సమావేశం
- January 19, 2024
దావోస్: సౌదీ అరేబియా ఈ ఏప్రిల్లో రియాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. గురువారం 'సౌదీ అరేబియా: ది కోర్స్ ఎహెడ్' ప్యానెల్ మీటింగ్ సందర్భంగా సౌదీ ఎకానమీ మరియు ప్లానింగ్ మంత్రి ఫైసల్ అల్ ఇబ్రహీం తెలిపారు. వివిధ రంగాలకు కేంద్రంగా మరియు ప్రపంచ ఆలోచనా నాయకత్వానికి కేంద్రంగా రియాద్ అభివృద్ధి చెందుతున్నదని ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడంలో మరియు శక్తి అభివృద్ధి అవసరాలను పరిష్కరించడంలో ఇది ముఖ్యమైనదని WEF అధ్యక్షుడు బోర్గే బ్రెండే వెల్లడించారు. ఏప్రిల్ 28 ,29 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం COVID-19 ప్రారంభమైనప్పటి నుండి దావోస్ ఫోరమ్ల వెలుపల నిర్వహించే మొదటి ప్రత్యేక WEF సమావేశం కానుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన సౌదీ నాయకత్వానికి బ్రెండే కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు







