రియాద్ వేదికగా ఏప్రిల్లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ ప్రత్యేక సమావేశం
- January 19, 2024
దావోస్: సౌదీ అరేబియా ఈ ఏప్రిల్లో రియాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. గురువారం 'సౌదీ అరేబియా: ది కోర్స్ ఎహెడ్' ప్యానెల్ మీటింగ్ సందర్భంగా సౌదీ ఎకానమీ మరియు ప్లానింగ్ మంత్రి ఫైసల్ అల్ ఇబ్రహీం తెలిపారు. వివిధ రంగాలకు కేంద్రంగా మరియు ప్రపంచ ఆలోచనా నాయకత్వానికి కేంద్రంగా రియాద్ అభివృద్ధి చెందుతున్నదని ఆయన వివరించారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడంలో మరియు శక్తి అభివృద్ధి అవసరాలను పరిష్కరించడంలో ఇది ముఖ్యమైనదని WEF అధ్యక్షుడు బోర్గే బ్రెండే వెల్లడించారు. ఏప్రిల్ 28 ,29 తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశం COVID-19 ప్రారంభమైనప్పటి నుండి దావోస్ ఫోరమ్ల వెలుపల నిర్వహించే మొదటి ప్రత్యేక WEF సమావేశం కానుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన సౌదీ నాయకత్వానికి బ్రెండే కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







