ఇండో-మలేషియా ఫిల్మ్ ఎక్స్ చేంజ్ నిర్వహించిన ఎఫ్.టి.పీ.సి ఇండియా
- February 03, 2024
కౌలాలంపూర్: బాహుబలి, పుష్ప, సలార్ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా అంటే మలేషియన్ వాసులు అమితాసక్తిని కనబరుస్తున్నారని, ముఖ్యంగా మన పాటలు వారు స్పష్టంగా పడుతుండటం చూసి ఎంతో ఆనందం కలిగిందని ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు జంగా చైతన్య, విజయ్ వర్మ పాకలపాటి హర్షం వ్యక్తం చేశారు. సినీ సాంకేతికత, నైపుణ్యం మరియు టూరిజం వంటివి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుటయే లక్యంగా ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలో కార్యక్రమాలు నిర్వహించిన ఎఫ్.టి.పి.సి ఈ వారంలో మలేషియా లోని కౌలాలంపూర్ లో ఇండో-మలేషియా ఫిలిం అండ్ టూరిజం ఎక్స్చేంజి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించి ఇండియాలో వున్న సినీ సాంకేతిక నిపుణత మరియు లొకేషన్స్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. అలాగే మలేషియాలో వున్న లొకేషన్స్ మరియు సాంకేతిక నిపుణులతో అవగాహన కుదుర్చుకొంది. తద్వారా మన చిత్రాలు సులభంగా అక్కడ షూటింగ్ చేసుకొనే వీలుందని ఎఫ్ టి పీ సి సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.


తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







