రమదాన్ నెలలో భిక్షాటన చేస్తే Dh 500,000 వరకు జరిమానా, జైలుశిక్ష
- March 02, 2024
యూఏఈ: పవిత్ర మాసం దగ్గర పడుతుండటంతో మరియు నివాసితులు రమదాన్ కోసం సన్నద్ధమవుతున్నారు. దుబాయ్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎమిరేట్లో భిక్షాటనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భిక్షాటన-వ్యతిరేక ప్రచారం ఏప్రిల్ 13నుండి ప్రారంభమవుతుంది. భిక్షాటన చేస్తూ పట్టుబడితే కనీస జరిమానా Dh 5,000 , మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ కెమ్జీ హెచ్చరించారు. విదేశాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భిక్షాటన చేయించే వారికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్లకు తగ్గకుండా జరిమానా విధించబడుతుంది. అదే విధంగా లైసెన్స్ లేకుండా నిధుల సేకరణ చేస్తే Dh250,000 -Dh500,000 వరకు జరిమానా విధిస్తారు. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వవద్దని అధికారులు నివాసితులను కోరారు. గతేడాది 1,700 మంది యాచకులను పట్టుకుని శిక్షించామన్నారు. వీరిలో 487 మంది మహిళలు, 1,238 మంది పురుషులు ఉన్నారని కల్నల్ అల్ కెమ్జీ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









