రమదాన్ నెలలో భిక్షాటన చేస్తే Dh 500,000 వరకు జరిమానా, జైలుశిక్ష
- March 02, 2024
యూఏఈ: పవిత్ర మాసం దగ్గర పడుతుండటంతో మరియు నివాసితులు రమదాన్ కోసం సన్నద్ధమవుతున్నారు. దుబాయ్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ఎమిరేట్లో భిక్షాటనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భిక్షాటన-వ్యతిరేక ప్రచారం ఏప్రిల్ 13నుండి ప్రారంభమవుతుంది. భిక్షాటన చేస్తూ పట్టుబడితే కనీస జరిమానా Dh 5,000 , మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ కెమ్జీ హెచ్చరించారు. విదేశాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి భిక్షాటన చేయించే వారికి కనీసం ఆరు నెలల జైలు శిక్ష, 100,000 దిర్హామ్లకు తగ్గకుండా జరిమానా విధించబడుతుంది. అదే విధంగా లైసెన్స్ లేకుండా నిధుల సేకరణ చేస్తే Dh250,000 -Dh500,000 వరకు జరిమానా విధిస్తారు. బిచ్చగాళ్లకు డబ్బు ఇవ్వవద్దని అధికారులు నివాసితులను కోరారు. గతేడాది 1,700 మంది యాచకులను పట్టుకుని శిక్షించామన్నారు. వీరిలో 487 మంది మహిళలు, 1,238 మంది పురుషులు ఉన్నారని కల్నల్ అల్ కెమ్జీ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!









