రెమ్యునరేషన్ విషయంలో సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు.!
- March 07, 2024సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు.. హీరో కానీ, హీరోయిన్ కానీ రెమ్యునరేషన్ పెంచేస్తారు.. అనే ప్రచారం వుంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి విషయంలోనూ తాజాగా అదే ప్రచారం జరుగుతుంది.
సాయి పల్లవి మంచి నటి. మంచి ఫాలోయింగ్ వుంది. అయినా స్టార్ హీరోయిన్ అయిపోవాలన్న అత్యాశకు పోకుండా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంటుంది.
ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సాయి పల్లవికి రెమ్యునరేషన్ గురించిన ప్రశ్న ఎదురైంది.
ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారట కదా మీరు.. అనేదే ఆ ప్రశ్న. అందుకు సాయి పల్లవి ఇచ్చిన సమాధానం.. నేను నటించిన సినిమా సూపర్ హిట్ అయితే మేకర్సే నన్ను పిలిచి మరీ ఎక్కువ అమౌంట్ ఇస్తారు.. అలాంటప్పుడు నేనెందుకు డిమాండ్ చేయడం అని సమాధానమిచ్చింది.
అలాగే, ఒకవేళ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే సిట్యువేషనే రావాలంటే.. అది నేను నటించలేని పాత్ర.. అత్యంత కఠినమైన పాత్ర అయ్యుండాలి.. అప్పుడేమైనా డిమాండ్ చేస్తానేమో.. అని నవ్వుతూ సాయి పల్లవి సమాధానమిచ్చింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా