అయ్యో పాపం పూరీ సోదరా.! గ్యాప్ తీసుకున్నా కానీ.!
- March 16, 2024
అటు అన్న పూరీ జగన్నాధ్కీ, ఇటు తమ్ముడు సాయిరామ్ శంకర్కీ ఇద్దరికీ ఏదీ కలిసి రావడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాధ్ అంటే ఓ సెన్సేషన్. ప్రతీ హీరో ఆయనతో సినిమా చేయాలనుకునేవారు.
కానీ, ‘లైగర్’ తర్వాత సీను మారిపోయింది. పూరీ అంటేనే భయపడిపోతున్నారు. ఇక, ఆయన సోదరుడు గతంలో ‘143’ తరహా సినిమాల్లో నటించి తనకంటూ హీరోగా ఓ కొత్త పంథా సృష్టించుకున్నాడు. కానీ, నిలదొక్కుకోలేకపోయాడు.
లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. లేటెస్ట్గా ‘వెయ్ దరువెయ్’ అంటూ తనకు కొట్టిన పిండి అయిన మాస్ పంథాలోనే మళ్లీ ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ, ఇప్పుడు కూడా సినీ జనం లైట్ తీసుకున్నారు.
రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ తనదైన పర్ఫామెన్స్ ఇచ్చినప్పటికీ కథ, కథనం నడిపిన తీరు జనానికి ఎక్కలేదు. దాంతో, సింపుల్గా రిజక్ట్ చేసేశారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









