ప్రశ్నా పత్రాల లీక్ కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన అప్పీల్ కోర్టు
- March 17, 2024
కువైట్ సిటీ: ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఒక కువైట్ వ్యక్తికి, కువైట్ మహిళకు రెండేళ్ళ జైలుశిక్ష.. ప్రవాస వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి అబ్దుల్ రెహ్మాన్ అల్ దర్మీ అధ్యక్షతన అప్పీల్ కోర్టు కొట్టివేసింది. హైస్కూల్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు.. KD 308,000 లాండరింగ్ చేసినందుకు ప్రవాస మహిళకు, వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష ప్రకటించగా.. తాజాగా కోర్టు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించింది. మరో కేసులో ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు కువైట్ పౌరుడిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. పోలీసుల దర్యాప్తులో హైస్కూల్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్ర, అలాగే నేరాల ఫలితంగా వారి బ్యాంక్ ఖాతాలలోకి అక్రమంగా డబ్బు జమ అయినట్లు విచారణలో వెల్లడి కావడంతో దిగువ కోర్టు దోషులగా నిర్ధారించి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







