ప్రశ్నా పత్రాల లీక్ కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన అప్పీల్ కోర్టు
- March 17, 2024
కువైట్ సిటీ: ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఒక కువైట్ వ్యక్తికి, కువైట్ మహిళకు రెండేళ్ళ జైలుశిక్ష.. ప్రవాస వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి అబ్దుల్ రెహ్మాన్ అల్ దర్మీ అధ్యక్షతన అప్పీల్ కోర్టు కొట్టివేసింది. హైస్కూల్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు.. KD 308,000 లాండరింగ్ చేసినందుకు ప్రవాస మహిళకు, వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష ప్రకటించగా.. తాజాగా కోర్టు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించింది. మరో కేసులో ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు కువైట్ పౌరుడిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. పోలీసుల దర్యాప్తులో హైస్కూల్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్ర, అలాగే నేరాల ఫలితంగా వారి బ్యాంక్ ఖాతాలలోకి అక్రమంగా డబ్బు జమ అయినట్లు విచారణలో వెల్లడి కావడంతో దిగువ కోర్టు దోషులగా నిర్ధారించి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









