ప్రశ్నా పత్రాల లీక్ కేసు.. ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన అప్పీల్ కోర్టు
- March 17, 2024
కువైట్ సిటీ: ప్రశ్నా పత్రాల లీక్ కేసులో ఒక కువైట్ వ్యక్తికి, కువైట్ మహిళకు రెండేళ్ళ జైలుశిక్ష.. ప్రవాస వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ దిగువ కోర్టు వెలువరించిన తీర్పును న్యాయమూర్తి అబ్దుల్ రెహ్మాన్ అల్ దర్మీ అధ్యక్షతన అప్పీల్ కోర్టు కొట్టివేసింది. హైస్కూల్ పరీక్షల ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు.. KD 308,000 లాండరింగ్ చేసినందుకు ప్రవాస మహిళకు, వ్యక్తికి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష ప్రకటించగా.. తాజాగా కోర్టు వారిపై ఉన్న అభియోగాలను కొట్టివేసి నిర్దోషులుగా ప్రకటించింది. మరో కేసులో ప్రశ్న పత్రాలను లీక్ చేసినందుకు కువైట్ పౌరుడిని నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. పోలీసుల దర్యాప్తులో హైస్కూల్ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేయడంలో ఇతరుల ప్రమేయం, నిందితుల పాత్ర, అలాగే నేరాల ఫలితంగా వారి బ్యాంక్ ఖాతాలలోకి అక్రమంగా డబ్బు జమ అయినట్లు విచారణలో వెల్లడి కావడంతో దిగువ కోర్టు దోషులగా నిర్ధారించి శిక్షలు విధించింది.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







