రేపటి నుంచి ఆన్లైన్లో IPL టిక్కెట్ల విక్రయం
- March 17, 2024
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పోటీలు ఈ నెల 22వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో తొలి మ్యాచ్కు చేపాక్కం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఆ రోజున పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ 22వ తేది రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ఈ నెల 18వ తేది ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో ప్రారంభం కానుంది. స్టేడియంలోని సీ,డీ,ఈ లోయర్ టిక్కెట్టు ధర రూ.1,700, ఐ,జే,కే అప్పర్ రూ.4,000, ఐ,జే,కే లోయర్ రూ.4,500, సీ,డీ,ఈ అప్పర్ రూ.4,000, కేఎంకే టెర్రస్ టిక్కెట్టు ధర రూ.7.500గా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒకరు రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చని, పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









