రేపటి నుంచి ఆన్లైన్లో IPL టిక్కెట్ల విక్రయం
- March 17, 2024
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పోటీలు ఈ నెల 22వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో తొలి మ్యాచ్కు చేపాక్కం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఆ రోజున పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ 22వ తేది రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ఈ నెల 18వ తేది ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో ప్రారంభం కానుంది. స్టేడియంలోని సీ,డీ,ఈ లోయర్ టిక్కెట్టు ధర రూ.1,700, ఐ,జే,కే అప్పర్ రూ.4,000, ఐ,జే,కే లోయర్ రూ.4,500, సీ,డీ,ఈ అప్పర్ రూ.4,000, కేఎంకే టెర్రస్ టిక్కెట్టు ధర రూ.7.500గా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒకరు రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చని, పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు.
తాజా వార్తలు
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్







