రేపటి నుంచి ఆన్లైన్లో IPL టిక్కెట్ల విక్రయం
- March 17, 2024
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పోటీలు ఈ నెల 22వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పోటీల్లో తొలి మ్యాచ్కు చేపాక్కం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఆ రోజున పోటీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ 22వ తేది రాత్రి 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం ఈ నెల 18వ తేది ఉదయం 9.30 గంటలకు ఆన్లైన్లో ప్రారంభం కానుంది. స్టేడియంలోని సీ,డీ,ఈ లోయర్ టిక్కెట్టు ధర రూ.1,700, ఐ,జే,కే అప్పర్ రూ.4,000, ఐ,జే,కే లోయర్ రూ.4,500, సీ,డీ,ఈ అప్పర్ రూ.4,000, కేఎంకే టెర్రస్ టిక్కెట్టు ధర రూ.7.500గా నిర్ణయించారు. ఆన్లైన్లో ఒకరు రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చని, పేటీఎం, చెన్నై సూపర్ కింగ్స్ వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చని సీఎస్కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేఎస్ విశ్వనాథన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









