ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- March 19, 2024
మస్కట్: జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్లు, పేటెంట్లు, కాపీరైట్లు మరియు డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 2023లో 12.59 శాతం పెరిగి 14,234కి పెరిగిందని, 2022లో 12,642 దరఖాస్తులు నమోదయ్యాయని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని జాతీయ మేధో సంపత్తి కార్యాలయం జారీ చేసిన గణాంకాలను వెల్లడించింది. 2023లో జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్ల కోసం 13,196 దరఖాస్తులు దాఖలయ్యాయి. 2022లో 11,744 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ల కోసం మొత్తం 874 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. 2022లో 737 దరఖాస్తులు నమోదు కాగా.. 2023లో కాపీరైట్ల కోసం మొత్తం 143 దరఖాస్తులు, 2022లో 144 దరఖాస్తులు వచ్చాయి. 2022లో నమోదైన 17 దరఖాస్తులతో పోలిస్తే 2023లో పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 21కి పెరిగిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు







