ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- March 19, 2024
మస్కట్: జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్లు, పేటెంట్లు, కాపీరైట్లు మరియు డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 2023లో 12.59 శాతం పెరిగి 14,234కి పెరిగిందని, 2022లో 12,642 దరఖాస్తులు నమోదయ్యాయని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని జాతీయ మేధో సంపత్తి కార్యాలయం జారీ చేసిన గణాంకాలను వెల్లడించింది. 2023లో జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్ల కోసం 13,196 దరఖాస్తులు దాఖలయ్యాయి. 2022లో 11,744 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ల కోసం మొత్తం 874 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. 2022లో 737 దరఖాస్తులు నమోదు కాగా.. 2023లో కాపీరైట్ల కోసం మొత్తం 143 దరఖాస్తులు, 2022లో 144 దరఖాస్తులు వచ్చాయి. 2022లో నమోదైన 17 దరఖాస్తులతో పోలిస్తే 2023లో పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 21కి పెరిగిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఒమన్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు కొత్త రుసుములు..!!
- బహ్రెయిన్లో 16 ఏళ్లలోపు పిల్లలకు ఈ-బైక్లు నిషేధం..!!
- అబుదాబిలో ఫార్మ్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్లో స్వీట్న్డ్ డ్రింక్స్కు ఎలక్ట్రానిక్ టెస్టింగ్..!!
- ప్రధాని మోదీ సభకు BookMyShowలో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!
- రష్యాలో ఘోర విషాదం..మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి
- 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో సాధించింది అరెస్టులే: కేటీఆర్
- సౌదీ అరేబియాలో 4,464 జెనెసిస్ కార్ల రీకాల్..!!
- కువైట్లో 7,019 మంది ఉపాధ్యాయుల తొలగింపు..!!







