ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- March 19, 2024
మస్కట్: జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్లు, పేటెంట్లు, కాపీరైట్లు మరియు డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 2023లో 12.59 శాతం పెరిగి 14,234కి పెరిగిందని, 2022లో 12,642 దరఖాస్తులు నమోదయ్యాయని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని జాతీయ మేధో సంపత్తి కార్యాలయం జారీ చేసిన గణాంకాలను వెల్లడించింది. 2023లో జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్ల కోసం 13,196 దరఖాస్తులు దాఖలయ్యాయి. 2022లో 11,744 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ల కోసం మొత్తం 874 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. 2022లో 737 దరఖాస్తులు నమోదు కాగా.. 2023లో కాపీరైట్ల కోసం మొత్తం 143 దరఖాస్తులు, 2022లో 144 దరఖాస్తులు వచ్చాయి. 2022లో నమోదైన 17 దరఖాస్తులతో పోలిస్తే 2023లో పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 21కి పెరిగిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..
- ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్ల పై ట్రంప్కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!







