ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అప్లికేషన్లలో 12.59% పెరుగుదల
- March 19, 2024
మస్కట్: జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్లు, పేటెంట్లు, కాపీరైట్లు మరియు డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 2023లో 12.59 శాతం పెరిగి 14,234కి పెరిగిందని, 2022లో 12,642 దరఖాస్తులు నమోదయ్యాయని వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖలోని జాతీయ మేధో సంపత్తి కార్యాలయం జారీ చేసిన గణాంకాలను వెల్లడించింది. 2023లో జాతీయ మరియు అంతర్జాతీయ ట్రేడ్మార్క్ల కోసం 13,196 దరఖాస్తులు దాఖలయ్యాయి. 2022లో 11,744 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్ల కోసం మొత్తం 874 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. 2022లో 737 దరఖాస్తులు నమోదు కాగా.. 2023లో కాపీరైట్ల కోసం మొత్తం 143 దరఖాస్తులు, 2022లో 144 దరఖాస్తులు వచ్చాయి. 2022లో నమోదైన 17 దరఖాస్తులతో పోలిస్తే 2023లో పారిశ్రామిక డిజైన్ల కోసం దరఖాస్తుల సంఖ్య 21కి పెరిగిందని గణంకాలు తెలిపాయి.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









