స్త్రీల తలలు నరికిన ఐఎస్ఐఎస్
- June 30, 2015
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలతో స్థానికులు ప్రతి నిమిషం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బ్రతుకుతున్నారు. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియక అల్లాడుతున్నారు. ఇటీవల సిరియాలో ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారని ఇస్లామిక్ స్టేట్ త్రీవవాదులు అనుమానం పెంచుకున్నారు. ఆదివారం ఒక మహిళను, ఆమె భర్తను, సోమవారం ఇంకొక మహిళ ఆమె భర్తను పట్టుకుని తలలు నరికి వేశారు. అందరూ చూస్తున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు బహిరంగ ప్రదేశంలో ఈ దారుణానికి పాల్పడ్డారని సిరియా మానవహక్కుల పరిశీలన సంఘం వెల్లడించింది. సిరియాలోని డైర్ ఎజోర్ రాష్ట్రంలో మహిళలు, వారి భర్తల తలలు నరికి వేశారని మానవ హక్కుల సంఘం చీఫ్ రమీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపిస్తు గతంలో బహిరంగ ప్రాంతాలలో మహిళలను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. అయితే మహిళల తలలు నరకడం ఇదే మొదటి సారి అని మానవ హక్కుల సంఘం ప్రతినిధులు అంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఇరాక్, సిరియాలో 3,000 మందికి పైగా స్థానికులను ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చంపేశారు. అందులో మహిళలు 1,800 మంది, 74 మంది పిల్లలు ఉన్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు రోజుకు ఒక విధంగా సామాన్యులను అంతం చేసి వారి పైచాచికాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







