నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం
- June 04, 2016
వేడి తగలకుండా వ్యాయామం..
వ్యాయామం వల్ల మేలెంతో చెప్పక్కర్లేదు. కానీ వేసవి వస్తే చాలామంది వ్యాయామం విషయంలో తటపటాయిస్తుంటారు. అధికవేడి వల్ల చెమట ఎక్కువగా బయటకుపోయి.. నీరసం రావడం, చిరాగ్గా అనిపించడం ఓ కారణం. ఆ సమస్య రాకుండా ఇలా చేయండి..
*
ఆరుబయట చేసే పరుగూ, వేగవంతమైన నడక కంటే నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరైతే ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం ఆరుతర్వాతే నడకవంటి వ్యాయమాలు చేయండి. అప్పుడే ఎండ వేడి నుంచి తప్పించుకోగలుగుతారు. ముఖచర్మం ఆరోగ్యం కోసం కచ్చితంగా సన్స్క్రీన్లోషన్ రాసుకోండి.
*
వ్యాయామం కోసం ఎంచుకునే దుస్తులు శరీరానికి తగిన గాలినందించేలా ఉండాలి.
చెమటని ఇట్టే పీల్చుకునేవై ఉండాలి. టీ షర్ట్లు, ట్యాంక్ టాప్లు, షార్ట్ల వంటివి చక్కగా సరిపోతాయి ఈ కాలానికి.
*
వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా నీళ్ల సీసా దగ్గర పెట్టుకోండి. అలసట అనిపించినప్పుడు గటగటా తాగేయకుండా కొద్దికొద్దిగా చప్పరించండి చాలు.
*
నీళ్లు మరీ అధికంగా తాగితే.. ఎక్కుసార్లు మూత్రం పోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నీళ్లకి ప్రత్యామ్నాయంగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్ సాల్ట్ వంటివి తీసుకోండి. శరీరం తాజాగా ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









