ఉచిత వైఫై 8 స్టేషన్లలో ...
- June 04, 2016
రైల్వే ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేందుకు త్వరలో ఏడు రైల్వే స్టేషన్లులో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సెర్చింజెన్ గూగుల్ సాయంతో అలహాబాద్, సెల్దాహ్తో పాటు ఏడు స్టేషన్లకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం రైల్వేశాఖ పదకొండు ప్రాంతాల్లో ఉచిత వైఫై సదుపాయాన్ని రైల్వే ప్రయాణికులకు కల్పిస్తోంది. ముంబయి సెంట్రల్, భువనేశ్వర్, కాచిగూడ, విజయవాడ, రాయ్పూర్, భోపాల్, పట్నా, రాంచీ, విశాఖపట్నం, జయపుర, గువాహటిలో ఈ సదుపాయం ఉంది. .
పూణె, ఎర్నాకులం, లఖ్నవూ, ఉజ్జయిని, గోరఖ్పూర్ స్టేషన్లులో త్వరలోనే ఉచిత వైఫై సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికులకు, సందర్శకులకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు కల్పించేందుకు గూగుల్, రైల్టెల్, పీఎస్యూతో కలిసి రైల్వే శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది నాటికి దాదాపు 100 ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లులో ఉచిత వైఫై సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









