యూఏఈలో అలర్ట్ జారీ జారీ
- April 17, 2024యూఏఈ: దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు క్షీణించడంతో నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ యూఏఈలోని చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాధారణమైన తీవ్రతతో కూడిన ప్రమాదకర వాతావరణ సంఘటనలు అంచనా నేపథ్యంలో నివాసితులు 'అత్యంత అప్రమత్తంగా' ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. ఆరెంజ్ అలర్ట్ ప్రాంతాలు నివాసితులు తప్పనిసరిగా లుకౌట్లో ఉండాలని, అయితే ఎల్లో హెచ్చరిక ప్రాంతాలు సాపేక్షంగా తేలికపాటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
యూఏఈలోని ప్రభుత్వ ఉద్యోగులు బుధవారం కూడా ఇంటి నుండి పని చేయాలని ఉత్తర్వుల ద్వారా ఆదేశించారు. దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేశారు. దేశంలో అస్థిర వాతావరణ పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల కోసం దుబాయ్ రిమోట్ వర్కింగ్ పీరియడ్ను పొడిగించింది. ఉద్యోగులను రిమోట్లో పనిచేయనివ్వాలని ప్రైవేట్ రంగ సంస్థలకు సూచించింది. షార్జాలోని ఫెడరల్ ఉద్యోగులు కూడా బుధవారం ఇంటి నుండి పని చేయాలని ఆదేశించారు. రెండు ఎమిరేట్స్లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు బుధవారం ఆన్లైన్ తరగతులను నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి