దుబాయ్ లో ఒరిగిన భవనం..ఆందోళనలో నివాసితులు
- April 21, 2024
దుబాయ్: దుబాయ్లోని ముహైస్నా 4లోని బహుళ అంతస్తుల టవర్ నిర్మాణం దెబ్బతినడంతో శుక్రవారం (ఏప్రిల్ 19) అర్థరాత్రి ఆ ప్రాంగణంలో నివసిస్తున్న 100కు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. రాత్రి 8:30 గంటలకు 'భూకంపం లాంటి' కుదుపును అనుభవించినట్లు పలువురు నివాసితులు పేర్కొన్నారు. ఇది కొన్ని సెకన్ల పాటు ఉందని తెలిపారు. కొన్ని గంటల తర్వాత, దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెంటనే భవనం ఖాళీ చేయాలని నివాసితులను కోరారు. భవనం ఒక వైపు పగుళ్లు రావడంతో.. అది ఒక వైపునకు వంగడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. మరోవైపు యూఏఈలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా భవనం సెల్లార్ లో నీరు చేరిందని అద్దెదారులు తెలిపారు. నీటిని బయటకు పంపుతున్నప్పటికీ ఐదు రోజులు గడిచినా బేస్మెంట్లో కార్లు వరదనీటిలోనే ఉన్నాయి. రెండేళ్లకు పైగా భవనంలో నివసిస్తున్న లక్ష్మి మాట్లాడుతూ.. 9వ అంతస్థులోని అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేసరికి దాదాపు ఉదయం 6 గంటలైందని పేర్కొంది. తాము మా పత్రాలు మరియు బట్టలు రెండు సూట్కేసులలో సర్దుకుని బయలుదేరామని తెలిపింది. "అక్టోబర్లో మా రెన్యూవల్ గడువు ఉంది" అని లక్ష్మి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!







