దుబాయ్ లో ఒరిగిన భవనం..ఆందోళనలో నివాసితులు
- April 21, 2024
దుబాయ్: దుబాయ్లోని ముహైస్నా 4లోని బహుళ అంతస్తుల టవర్ నిర్మాణం దెబ్బతినడంతో శుక్రవారం (ఏప్రిల్ 19) అర్థరాత్రి ఆ ప్రాంగణంలో నివసిస్తున్న 100కు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. రాత్రి 8:30 గంటలకు 'భూకంపం లాంటి' కుదుపును అనుభవించినట్లు పలువురు నివాసితులు పేర్కొన్నారు. ఇది కొన్ని సెకన్ల పాటు ఉందని తెలిపారు. కొన్ని గంటల తర్వాత, దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెంటనే భవనం ఖాళీ చేయాలని నివాసితులను కోరారు. భవనం ఒక వైపు పగుళ్లు రావడంతో.. అది ఒక వైపునకు వంగడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. మరోవైపు యూఏఈలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా భవనం సెల్లార్ లో నీరు చేరిందని అద్దెదారులు తెలిపారు. నీటిని బయటకు పంపుతున్నప్పటికీ ఐదు రోజులు గడిచినా బేస్మెంట్లో కార్లు వరదనీటిలోనే ఉన్నాయి. రెండేళ్లకు పైగా భవనంలో నివసిస్తున్న లక్ష్మి మాట్లాడుతూ.. 9వ అంతస్థులోని అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేసరికి దాదాపు ఉదయం 6 గంటలైందని పేర్కొంది. తాము మా పత్రాలు మరియు బట్టలు రెండు సూట్కేసులలో సర్దుకుని బయలుదేరామని తెలిపింది. "అక్టోబర్లో మా రెన్యూవల్ గడువు ఉంది" అని లక్ష్మి చెప్పారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







