స్పీడు పెంచిన నాగ చైతన్య.!
- April 30, 2024
‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ దండు. ఈ డైరెక్టర్ అక్కినేని హీరో నాగచైతన్యతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
డిశంబర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఈ లోపే కార్తీక్ దండు సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. రేపో మాపో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట.
ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అలాగే, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోందట.
కాగా, ఈ సినిమా కథ, కాన్సెప్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో మిళితమైన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతోందట.
ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాలోని సన్నివేశాలు వుండబోతున్నాయట. గతంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ని టచ్ చేశాడు. విజయం సాధించాడు.
ఇప్పుడు మళ్లీ అదే టైప్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు. కార్తీక్ చెప్పిన కథ చాలా బాగుందట. ఆల్రెడీ ‘విరూపాక్ష’ సినిమాతో ఈ డైరెక్టర్ మంచి మార్కులేయించుకున్నాడు. సో, అదే తరహా కాన్సెప్ట్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలిసినోడే కాబట్టి.. నాగ చైతన్యకు కార్తీక్ దండు రూపంలో ఓ హిట్ రెడీగా వుందనే అనుకోవచ్చేమో.!
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







