స్పీడు పెంచిన నాగ చైతన్య.!
- April 30, 2024
‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కార్తీక్ దండు. ఈ డైరెక్టర్ అక్కినేని హీరో నాగచైతన్యతో ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
డిశంబర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, ఈ లోపే కార్తీక్ దండు సినిమాని పట్టాలెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. రేపో మాపో ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట.
ఈ సినిమాలో పూజా హెగ్ధే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. అలాగే, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోందట.
కాగా, ఈ సినిమా కథ, కాన్సెప్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో మిళితమైన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందబోతోందట.
ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమాలోని సన్నివేశాలు వుండబోతున్నాయట. గతంలో ‘ధూత’ అనే వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ని టచ్ చేశాడు. విజయం సాధించాడు.
ఇప్పుడు మళ్లీ అదే టైప్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు. కార్తీక్ చెప్పిన కథ చాలా బాగుందట. ఆల్రెడీ ‘విరూపాక్ష’ సినిమాతో ఈ డైరెక్టర్ మంచి మార్కులేయించుకున్నాడు. సో, అదే తరహా కాన్సెప్ట్ అయితే దాన్ని ఎలా డీల్ చేయాలో తెలిసినోడే కాబట్టి.. నాగ చైతన్యకు కార్తీక్ దండు రూపంలో ఓ హిట్ రెడీగా వుందనే అనుకోవచ్చేమో.!
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







