జాతిరత్నాలు 2’ లేటెస్ట్ అప్డేట్.!
- April 30, 2024
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే సినిమాతో ఫేమ్ సంపాదించుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి యూత్లో పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడీ యంగ్ స్టర్.
స్వీటీ అనుష్కతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటించి మెప్పించాడు. నవీన్ నటించిన ‘జాతి రత్నాలు’ సినిమాకి సీక్వెల్ వుండనుందని అప్పట్లోనే మేకర్లు తెలిపారు.
మరి, ఇంతవరకూ సీక్వెల్ ముచ్చట లేదేం.. అని ఈ మధ్య ఓ ప్రస్థావన రాగా.. అందుకు క్లారిటీ వచ్చింది హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా నుంచి. చిట్టి పాత్రలో నటించి ఈ సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించింది ఫరియా అబ్ధుల్లా.
ప్రస్తుతం ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మే తన నోటితో స్వయంగా ‘జాతా రత్నాలు 2’ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ వారు నిర్మించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్లో ‘కల్కి’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రిలీజ్ కాగానే ‘జాతి రత్నాలు 2’ సినిమా పట్టాలెక్కుతుందని చిట్టి పాప ఫరియా అబ్ధుల్లా వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ సీజ్
- పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో యూనిలివర్ లో నియామకాల పై బ్రేక్
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!









