ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- May 18, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లారు. సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని అమెరికాలోని వాషింగ్టన్ లో నివాసం ఉంటున్న డాక్టర్ తుళ్లూరు లోకేశ్ గా పోలీసులు గుర్తించారు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉన్నట్టు తెలిసింది.
కాగా, సీఎం జగన్ విదేశీ పర్యటనకు వ్యతిరేకంగా లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు సమాచారం. దీని గురించి పోలీసులు అతడిని ప్రశ్నించారు. జగన్ విదేశాలకు వెళ్లే సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావని అడగ్గా తనకు గుండెపోటు వచ్చిందని కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులు అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్ తుళ్లూరు లోకేశ్ వ్యవహారం పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!