కల్కి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటీ సంస్థ..
- May 21, 2024
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898AD ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.
ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు.
సినీ ఇండస్ట్రీ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కల్కి ఒకటి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్ లో వస్తుందా.. ? అని ఎదురుచూసేవాళ్ళు కొంతమంది అయితే.. సినిమా థియేటర్ నుంచి ఓటిటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని వెయిట్ చేస్తున్నవారు మరికొంతమంది. ఇక అలాంటి వారికి గుడ్ న్యూస్.
ఎట్టకేలకు కల్కి డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హిందీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయగా.. మిగతా అన్ని భాషలను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ డిజిటల్ ఎంట్రీలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. కల్కి కోసం అమెజాన్ ప్రైమ్ బాగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం హిందీ రైట్స్ కు నెట్ ఫ్లిక్స్ రూ. 175 కోట్లు ఖర్చు చేయగా.. అమెజాన్ అన్ని సౌత్ భాషలు కలిసి దాదాపు రూ.200 కోట్లు పెట్టినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ తన్నుకుపోతుంది.
ఈసారి పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాను అమెజాన్ అందుకోవడంతో మంచి లక్కీ ఛాన్స్ కొట్టిందని అభిమానులు అంటున్నారు. ఇకపోతే కల్కి జూన్ 27 న రిలీజ్ కానుంది. అన్ని సినిమాల లానే దాదాపు నాలుగువారాల తరువాత ఓటిటీలోకి వస్తుంది అని అనుకుంటే పొరపాటే. కల్కి కొద్దిగా టైమ్ తీసుకొని వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు అందుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..









