సత్య నాదెళ్లకు రూ.2 లక్షల జరిమానా: భారత్ ప్రభుత్వం
- May 23, 2024![1 సత్య నాదెళ్లకు రూ.2 లక్షల జరిమానా: భారత్ ప్రభుత్వం](https://www.maagulf.com/godata/articles/202405/aaa_1716450215.jpg)
న్యూఢల్లీః కంపెనీల చట్టం-2013లోని సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్ (ఎస్బీవో) నిబంధనలను మైక్రోసాఫ్ట్ సారధ్యంలోని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫారమ్ ‘లింక్డ్ఇన్ ఇండియా’ ఉల్లంఘించింది. కంపెనీకి సంబంధించి ముఖ్య ప్రయోజన యజమానిని (ఎస్బీవో) గుర్తించి కేంద్రానికి నివేదించడంలో కంపెనీ విఫలమైంది. చట్టంలోని సెక్షన్ 90(1) ప్రకారం నివేదించడంలో కంపెనీ సహా, కీలక స్థానాల్లో ఉన్న పలువురు అధికారులు ఫెయిల్ అయ్యారు. దీంతో మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల సహా లింక్డ్ఇన్లో పనిచేస్తున్న 8 మంది అధికారులకు కేంద్రం జరిమానా విధించింది. సత్య నాదెళ్ల సహా అందరికీ రూ.2 లక్షలు చొప్పున జరిమానా విధించింది. లింక్డ్ఇన్ కంపెనీకి రూ.7 లక్షలు పెనాల్టీ సహా మొత్తం రూ.27,10,800 మొత్తం జరిమానాగా విధించినట్టు పేర్కొంది.
ఈ జాబితాలో సత్య నాదెళ్ల, లింక్డ్ఇన్ కార్పొరేషన్ గ్లోబల్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్ సహా ఇతర అధికారులు ఉన్నారు. లింక్డ్ఇన్ సీఈవోగా ర్యాన్ రోస్లాన్స్ జూన్ 1, 2020న నియమితులయ్యారని, అప్పటి నుంచి సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయడం ప్రారంభించారని, కానీ ఎస్బీఓ నిబంధనల విషయంలో విఫలమయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను అందించాలని లింక్డ్ఇన్ను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశించింది.
కాగా కంపెనీల చట్టం నిబంధనల ప్రకారం కంపెనీల గణనీయ ప్రయోజన యజమాని (ఎస్బీవో) సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో లింక్డ్ఇన్ అధికారులు విఫలమయ్యారు. దీంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి జరిమానా విధించింది. కాగా డిసెంబర్ 2016లో లింక్డ్ఇన్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ఈ ఏడాది హజ్ చేసిన 1.83 మిలియన్ల మంది యాత్రికులు
- G7 సమ్మిట్.. UK ప్రధానిని కలిసిన యూఏఈ అధ్యక్షుడు
- మంగాఫ్ అగ్నిప్రమాదం..బాధిత కుటుంబాలకు 4 ఏళ్ల వరకు జీతం
- ఒమన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో స్మార్ట్ మొబిలిటీ సర్వీస్ ట్రయల్ ప్రారంభం
- ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ఇవే
- ఈద్ అల్ అదా..1,138 మంది ఖైదీల విడుదల
- మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్
- విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- ITR ఫైలింగ్.. ఆన్లైన్లో ఆదాయపు పన్ను రిటర్న్ను ఎలా ఫైల్ చేయాలి?