హైదరాబాదీలకి గుడ్ న్యూస్..కింగ్ కోహ్లీ ప్రత్యేక ఆహ్వానం..
- May 24, 2024
హైదరాబాద్: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పలు రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్రవేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ పక్క బ్రాండెడ్ క్లాత్ బిజినెస్తో పాటుగా కోహ్లీ మరోపక్క రెస్టారెంట్ల బిజినెస్ కూడా నిర్వహిస్తున్నాడు.
కొన్నేళ్లుగా కోహ్లీ వన్8 కమ్యూన్ పేరుతో రెస్టారెంట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ హోటల్స్ బెంగళూరు, ముంబై, పుణె, కోల్కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్స్ని కోహ్లీ ఏర్పాటు చేశాడు. అక్కడ వీటి వ్యాపారం జోరుగా సాగుతుంది. తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు గాను హైదరాబాద్ మహానగరంలో తన రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడానికి సిద్ధమయ్యారు.
ఈ వన్8 కమ్యూన్ కొత్త బ్రాంచ్ని కోహ్లీ హైదరాబాద్లోని HITEC సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ సమీపంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్లో శుక్రవారం గ్రాండ్గా ఓపెన్ కానుంది. ఈ విషయాన్ని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..