సోనియాతో రేవంత్ భేటి..

- May 29, 2024 , by Maagulf
సోనియాతో రేవంత్ భేటి..

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతోన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియాగాంధీని ఆయన కోరారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేకంగా సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియాతో భేటీ ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆమెను చీఫ్ గెస్ట్ గా పిలవాలని ఇప్పటికే తెలంగాణ కేబినెట్ తీర్మానించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను ఈ వేడుకలకు ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com